సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన 40 లగ్జరీ విల్లాల యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పదేళ్ల క్రితం కోట్లు ఖర్చు చేసి, అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన తమ ఇళ్లు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయని తెలియడంతో బాధితులు దిగ్భ్రాంతి చెందారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల మోసంతో తాము నట్టేట మునిగామని వాపోతున్నారు.