హైదరాబాద్లోని పలు ప్రైవేటు హాస్టళ్లలో అపరిశుభ్రమైన పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ 58 హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కిచెన్లలో అపరిశుభ్రత, గడువు ముగిసిన ఆహారం, కీటకాల బెడద వంటి సమస్యలు వెలుగుచూశాయి. 30 హాస్టళ్లకు నోటీసులు జారీ చేయగా.. 5 కిచెన్లను సీజ్ చేసి, మొత్తం రూ. 2,45,500 జరిమానా విధించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.