హైదరాబాద్ ఫోర్త్ సిటీ మెట్రోపై కీలక అప్డేట్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి మెుత్తం 40 కి.మీ దూరంతో మెట్రోను నిర్మించనున్నారు. ఇందులో 18 కి.మీ భూమార్గంలో మెట్రో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు డీపీఆర్ రెడీ చేస్తున్నారు. పలు గ్రామాల మీదుగా మెట్రోను నిర్మించనుండగా.. ఆయా గ్రామాలకు మహర్దశ పట్టనుంది. భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.