హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి-163 విస్తరణ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. వందల సంఖ్యలో మర్రిచెట్లు ఉన్న మార్గానికే మొగ్గు చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఎన్జీటీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినా.. రోడ్డు భద్రతపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.