హైదరాబాద్-పుణె-ముంబై మధ్య ప్రతిపాదించిన 671 కిలోమీటర్ల హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమైంది. దీని ద్వారా రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 15 గంటల నుండి కేవలం 3 గంటలకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టులో 101 వంతెనలు, ఖండాల ఘాట్లో 24 కిలోమీటర్ల మేర 13 సొరంగాలు, 35 కిలోమీటర్ల భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. తెలంగాణలో కోకాపేట, వికారాబాద్, శంషాబాద్లలో స్టేషన్లు ఏర్పాటు కానుండగా.. ఒక్కో స్టేషన్కు 247 ఎకరాల భూమిని కేటాయించాలని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.