కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి చెప్పడం వల్లే.. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో నదులను ప్రక్షాళన చేస్తున్నారని.. కానీ తెలంగాణలో మాత్రం మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.