హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్లో కొత్తగా మరో మూడు కారిడార్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఫోర్త్ సిటీ మెట్రోతో పాటుగా.. జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్పేటకు మెట్రో లైన్ ప్రతిపాదించారు. ఈ మూడు కారిడార్లకు సంబంధించి ప్రస్తుతం మెట్రో అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే డీపీఆర్ను కేంద్రం ఆమోదానికి పంపనున్నారు.