హైదరాబాద్ మెట్రో ఇక ప్రభుత్వ పరం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 30తో పూర్తి చేయనుంది. వచ్చే నెల 1 నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. రూ.15 వేల కోట్లతో ఎల్ అండ్ టీ నుంచి ఈక్విటీ వాటా బదిలీకి ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం సీఎస్ను దానికి ఛైర్మన్గా నియమించింది. ఐఏఎస్, ఐపీఎష్లు ఇందులో సభ్యులుగా ఉంటారు.