హైదరాబాద్లో మరోసారి భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు బయటికి వచ్చింది. ఏకంగా యూనివర్సిటీలోని విద్యార్థులను టార్గెట్గా చేసుకుని.. ఈ ముఠా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుల ఫోన్లలో 50 మంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం పోలీసులకు దొరికింది. దీని ఆధారంగా పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.