తెలంగాణ ముఖచిత్రం మార్చే హైదరాబాదు రీజినల్ రింగు రోడ్డును రెండు భాగాలుగా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఉత్తర భాగం పనులు మూడేళ్లలో పూర్తయ్యేలా ప్లాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, దక్షిణ భాగం పనులు కూడా సమాంతరంగా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ భాగం పనులకు రూ.14 వేలు కోట్లు అవసరం కాగా.. నిధుల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.