తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (RRR) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించడమే కాకుండా, వాణిజ్యాభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఉత్తర భాగంలో 88 శాతం భూసేకరణ పూర్తయింది. రైతులకు ఎకరానికి రూ.50 లక్షలు నుంచి రూ.1 కోటి వరకు పరిహారం చెల్లిస్తున్నారు. దక్షిణ భాగ భూసేకరణ, పర్యావరణ అనుమతులు, డీపీఆర్ తయారీ కొనసాగుతోంది.