హైదరాబాద్లో వరద ముంపు నివారణకు జీహెచ్ఎంసీ కీలక చర్యలు చేపట్టింది. నగర రహదారుల కింద భారీ భూగర్భ నీటి సంపులను నిర్మిస్తోంది. ఈ సంపులు రహదారులపై నీరు నిల్వకుండా, భూగర్భ జలాలను పెంచడానికి తోడ్పడతాయి. ఇప్పటికే 10 చోట్ల నిర్మాణం పూర్తయింది. మరిన్ని ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు మెుదలుపెట్టింది.