తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన అమెరికా-భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (USISPF)లో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్యస్థానమని వివరించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, పటిష్టమైన భద్రత, భౌగోళికంగా దేశానికి కేంద్ర స్థానంలో ఉండటం వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ దేశంలోనే అతిపెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటు కలిగిన రాష్ట్రమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.