హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 నుండి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు.