హైదరాబాద్లో రోడ్ల పరిశుభ్రతకు.. చెత్త సమస్యకు చెక్ పెట్టడం కోసం సరికొత్త యంత్రాలు రంగంలోకి దిగనున్నాయి. ఇన్ఆర్బిట్మాల్, నిర్మాన్ సంస్థలు సంయుక్తంగా 'స్పార్క్లింగ్ సైబరాబాద్' పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ లిట్టర్ పికర్ మెషీన్లను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. . ఇవి 240 లీటర్ల చెత్తను సేకరించగలుగుతాయి. 5 గంటల ఛార్జింగ్తో రోజంతా పనిచేస్తాయి. ఈ యంత్రాలు నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం చూపుతాయని భావిస్తున్నారు.