తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. హైదరాబాద్లోని ఆరు స్టేషన్ల కోసం దక్షిణ మధ్య రైల్వే రూ. 170.61 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే బేగంపేట స్టేషన్ ప్రారంభం కాగా.. మిగిలిన ఐదు స్టేషన్లలో పనులు జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ నాటికి పూర్తయి అందుబాటులోకి రానున్నాయి.