గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల కొత్త ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మార్గం ఐటీ ఉద్యోగులకు, ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరుకోవడానికి ఉపకరిస్తుందని సర్కార్ భావిస్తోంది.