హైదరాబాద్ మాదాపూర్లో గురువారం (ఫిబ్రవరి 27న) హెచ్సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైజింగ్ అనే అంశాన్ని ప్రస్తావిస్తే మొదట అందరూ సందేహాలు వ్యక్తం చేశారని.. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ జీడీపీ స్టేట్గా మార్చనున్నట్టు చెప్తే ఎవరూ నమ్మలేదని.. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ప్రపంచమంతా అంగీకరించక తప్పట్లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.