హైదరాబాద్లో వాహనదారులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.64.53 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్.. బాచుపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ను భారీగా తగ్గించనుంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభించడంతోపాటు.. పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.