హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో ప్లాట్లు వేలం వేసిన సంగతి తెలిసిందే. అయితే వేలంలో ప్లాట్లు దక్కించుకున్న పలువురు ఇంకా పూర్తి డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆయా ప్లాట్ల వేలం రద్దు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది.