నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ చెల్లింపులు పెరిగినట్లే.. సైబర్ నేరాలు కూడా అధికమవుతున్నాయి. చదువుకున్న వారు కూడా మోసపోవడం ఆందోళనకరం. తాజాగా.. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ వైన్ ఆర్డర్ చేస్తూ.. హోమ్ డెలివరీ కోసం పంపిన నకిలీ యూపీఐ స్కానర్ను స్కాన్ చేసి రూ. 40,000 కోల్పోయారు. డబ్బు స్వీకరించడానికి ఎప్పుడూ పిన్ లేదా స్కానర్ అవసరం లేదు అనే ప్రాథమిక నియమాన్ని గుర్తుంచుకోవాలి. అప్రమత్తంగా ఉంటూ.. తెలియని వెబ్సైట్లలో వ్యక్తిగత వివరాలు, ఓటీపీ పంచుకోకూడదు. మోసపోయామని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.