హైదరాబాద్‌లో ఆపరేషన్ సిందూర్ గణపతి

1 year ago 28
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబైంది. వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వడానికి గణనాథులు కొలువుదీరనున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ఓ వెరైటీ వినాయకుడు త్వరలోనే భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. భారత సైన్యానికి నివాళులర్పించే అద్భుతమైన ప్రదర్శనతో హైదరాబాద్ గణేష్ చతుర్థికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉప్పుగూడలోని శ్రీ మల్లికార్జున్ నగర్ యువజన సంక్షేమ సంఘం ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ప్రత్యేకంగా రూపొందించిన గణేష్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్థానిక కళాకారులు దాదాపు 6 లక్షల రూపాయల ఖర్చుతో తయారు చేసిన ఈ విగ్రహం సాయుధ దళాల బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో బ్రహ్మోస్ క్షిపణులు, S-400 మిస్సైల్స్, సైన్యం నేపథ్య నిర్మాణాల నమూనాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. దేశాన్ని కాపాడిన సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను గుర్తు చేస్తూ ఈ థీమ్‌ను ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Read Entire Article