పండుగ ఏదైనా హైదరాబాద్ నగరం అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రతీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక సినిమా హాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఆడియన్స్కు వినోదాన్ని పంచుతారు. ఇక వినాయక చవితి వస్తే ప్రతి వీధి ఆనందంతో మెరిసిపోతుంది. ఈసారి ఆ ఉత్సవాన్ని రెంట్టింపు చేస్తూ.. హెచ్ఎండీఏ లక్షకు పైగా మట్టి గణేశ్ విగ్రహాలను ఉచితంగా అందజేస్తోంది. ఆగస్టు 24 నుంచి 26 వరకు 34 కేంద్రాల్లో పంపిణీ జరుగుతుంది.