హైదరాబాద్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు ఎబోలా వైరస్ అనుమానితులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టగా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తితోపాటు అతడికి సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని కూడా ఐసోలేషన్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.