హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఐటీ కారిడార్లో సరికొత్త స్కైవాక్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. రాయదుర్గ్-టీహబ్ మార్గంలో ఈ కొత్త స్కైవాక్ నిర్మించాలని భావిస్తున్నారు. స్కైవాక్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత మార్గంలో.. ఉన్నతాధికారులతో కలిసి సైబరాబాద్ సీపీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లు దాటేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ మార్గంలో స్కైవాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు.