హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు కలకలం రేపింది. కలుషితమైన కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై అబ్కారీ అధికారులు వెంటనే స్పందించి మూడు కల్లు దుకాణాలను సీజ్ చేశారు. బాధితులకు మూత్రపిండాల సమస్యలు తలెత్తడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిస్థితిని సమీక్షించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.