హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు 7.1 కి.మీ మేర రూ.941 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో 54 కాలనీల ప్రజలకు, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఉపశమనం లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించగా.. కేంద్ర సహాయం కోసం వచ్చే వారం మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నట్లు తెలిపారు. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తామన్నారు.