హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్కు ప్రత్యామ్నాయంగా రూ. 307.74 కోట్ల వ్యయంతో కొత్త రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఆగస్టు 22 వరకు టెండర్ల గడువు ఉంది. ఈ ప్రాజెక్టులో 6 కిలోమీటర్ల పొడవైన రోడ్డుతో పాటు, ఆర్కేపురం వద్ద ఆర్ఓబీ, ఆర్ యూబీలను నిర్మిస్తారు. దీనికోసం మిలటరీ నుంచి 42.20 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ తీసుకుంటోంది. ఈ రోడ్లు పూర్తయితే మల్కాజిగిరి, నేరెడ్మెట్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది.