హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో సాధారణంగానే విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. దీంతో బస్సుల్లో సరిపడా సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అలానే నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు వాడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో 500 ఎలక్ట్రిక్ బస్సుల కావాలని ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈక్రమంలో గ్రేటర్ ఆర్టీసీ ఎండీ.. పలు ముఖ్యమైన అంశాలు వెల్లడించారు