హైదరాబాద్‌లో కోర్టుకు హాజరైన జగన్.. మళ్లీ రప్పా, రప్పా ఫ్లెక్సీలు

5 months ago 15
ఆస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌.. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత CBI కోర్టుకు ఆయన వస్తుండటంతో.. జగన్ అభిమానులు బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు భారీగా చేరుకున్నారు. అటు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బేగంపేట ఎయిర్‌పోర్టు, నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. జగన్ చూడటానికి వచ్చిన అభిమానులు ఏపీలో మాదిరిగానే రప్ప.. రప్ప.. ఫ్లెక్సీలను ప్రదర్శించారు. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేస్తూ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికారు.
Read Entire Article