భాగ్యనగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాల్సే లక్ష్యంగా చేసుకుని.. కుళ్లిపోయిన, రసాయనాలను కలిపిన మాంసాన్ని విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మటన్లో బీఫ్ కలపి, కుళ్లిపోయిన చేపలు, రొయ్యలకు సోడియం బైకార్బోనేట్ పౌడర్ను దట్టించి.. తక్కువ ధరలకే మాంసాన్ని అమ్ముతున్న ఐదుగురురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మాంసం, సోడియం బైకార్బోనేట్ కెమికల్ పౌడర్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.