leopard spotted in hyderabad: హైదరాబాద్ గోల్కొండ కోట ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటుతుండగా సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. స్థానికులు భయాందోళన చెందుతుండటంతో అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే నార్సింగిలో చిరుత సంచరించిన ఘటన మరవకముందే, గోల్కొండలో మరో చిరుత కనిపించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతాలు తగ్గిపోవడంతోనే వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు తెలిపారు.