హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత సంచారం భయాందోళనకు గురి చేసింది. దీంతో సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు క్యాంపస్లో బోను ఏర్పాటు చేశారు. బోనులో చిరుత చిక్కడంతో తృటిలో ప్రమాదం తప్పందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.