రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 'జిటో కనెక్ట్ 2025' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు ఉత్పత్తి చేస్తూ ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని, రక్షణ ఎగుమతులు రూ. 600 కోట్ల నుంచి రూ. 24,000 కోట్లకు పెరిగాయన్నారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో AI సిటీ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.