హైదరాబాద్ నగరవాసులకు బ్యాడ్న్యూస్. ఈసారి సమ్మర్లో నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు తెలిపారు. గతేడాది జనవరితో పోలిస్తే.. ఈ ఏడాది జనవరిలో చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటినట్లు గుర్తించారు. అత్యధికంగా కూకట్పల్లి ప్రాంతంలో 25.9 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.