హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసముంటున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా అపహరించింది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.