హైదరాబాద్ కేపీహెచ్బీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నేపాల్ దేశానికి చెందిన ఓ వ్యక్తి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోగా.. అతడి మృతదేహాన్ని స్వదేశం తరలించే స్థోమత లేకపోవటంతో ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. నేపాల్లో ఉన్న భార్య, పిల్లలు సహా.. ఇతర కుటుంబ సభ్యులు వీడియో కాల్లోనే కడసారి చూపుకు నోచుకున్నారు.