పెట్రోల్ ధరలు పెరగడమే కానీ తగ్గిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.10 పెంచితే.. రూ.2 ల వరకు మాత్రమే తగ్గించే వారు. ఇలా పెట్రోల్, డీజిల్ వాహనదారులకు ఇంధనం ధరలు పెరగడంతో ఖర్చు కూడా డబుల్ అవుతోంది. అయితే చాలా మంది పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడకుండా.. ఎలక్ట్రికల్ వెహికల్స్ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువగా లేకపోవడంతో కొంతమంది వాహనాలను కొనాలన్నా వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం జీహెచ్ఎంసీ కీలక ముందడుగు వేసింది.