తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మండే ఎండలతో పాటు విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో గాలిలో తేమశాతం భారీగా పడిపోయింది. దీంతో నగరంలో భరించలేనంతగా వేడి ఉంటుంది. నేడు సాధారణ ఉష్ణోగ్రతలు 2 శాతం పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.