హైదరాబాద్ నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేటతో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, పంజాగుట్టలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు యల్లో అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రేపు కూడా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.