హైదరాబాద్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రజల భద్రత కోసం నేడు ఐటీ, కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.