హైదరాబాద్లో కురుస్తున్న వానలతో రహదారులపై నీరు చేరి వాహన రద్దీ పెరిగింది. దీనితో నిత్యం బయటకెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. తెలంగాణ మంత్రి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించక తప్పలేదు. ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూడా తమ కాన్వాయ్లు వదిలేసి మెట్రో రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. అయితే హైదరాబాద్లో రోడ్డు మార్గాలపై నీరు నిలవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.