జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్లో నివసిస్తున్న 208 మంది పాకిస్థానీయులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. వీసా గడువు ముగిసిన వారు ఈనెల 27లోగా, వైద్యం కోసం వచ్చిన వారు 29లోగా వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. నగరంలో వారి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, పక్కా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ కుట్రపూరితంగానే ఈ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.