హైదరాబాద్లో ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని అధ్యయనం చెబుతోంది. పరీక్షలు నిర్వహించిన వారిలో ఏకంగా 81 శాతం మందికి ఒబేసిటీ సమస్య ఉందని తేలడం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. గతేడాదితో పోల్చితే ఈసారి ఏకంగా 18 శాతం ఒబేసిటీ బాధితులు పెరగడం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని డాక్టర్లు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.