ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పూర్తి చేయకుండానే.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టటాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. శ్రేణులతో కలిసి తమ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనగా.. మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు.