హైదరాబాద్‌లో మరిన్ని ఎలక్ట్రిక్ RTC బస్సులు.. 13 ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్‌ స్టేషన్లు

2 months ago 15
హైదరాబాద్ నగరంలో పర్యావరణహిత రవాణా దిశగా టీజీఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. నగరవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా గ్రేటర్ జోన్ పరిధిలోని మరో 13 డిపోల్లో కొత్తగా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 490 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. రాబోయే రెండేళ్లలో ఔటర్ రింగ్ రోడ్ లోపల కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదిలోగా అన్ని ప్రధాన డిపోల్లో ఛార్జింగ్‌ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article