Sky Walk Constructions: హైదరాబాద్లో నగరవాసుల భద్రత కోసం హెచ్ఎండీఏ మరో నాలుగు స్కైవాక్లను నిర్మించనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కూకట్పల్లి జేఎన్టీయూ, ఉప్పల్ జంక్షన్ ప్రాంతాల్లో ఈ స్కైవాక్లు రానున్నాయి. మెహిదీపట్నం స్కైవాక్ను ఆగస్టు 15న ప్రారంభిస్తారు. నగరంలో ఆదాయం పెంచేందుకు కొత్త లేఅవుట్లను అభివృద్ధి చేయాలని, మాస్టర్ ప్లాన్ 2050 పనులు వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. అంతేకాకుండా నగరంలో 19 కొత్త పార్కులను ఏర్పాటు చేయనున్నారు.