ఇప్పటికే మార్కెట్లో ఉన్న కుంభకోణాలు సరిపోవన్నట్టుగా.. మరో అతిపెద్ద స్కాం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన పే పాల్ యాప్ను వినియోగిస్తున్న విదేశీ కస్టమర్లే టార్గెట్గా చేసుకుని.. ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తూ.. ఫ్రాడ్ ప్రివెన్షన్ టీమ్ అని చెప్పుకుంటూ.. కస్టమర్ల బ్యాంగ్ ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు మొత్తం సేకరించి ఉన్నకాడికి దోచుకుంటున్న అతిపెద్ద కుంభకోణాన్ని పోలీసులు రట్టు చేశారు. ఈ క్రమంలో 63 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.