హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని.. టీజీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త బస్ డిపోలను ఏర్పాటు చేయనుంది. డిసెంబర్ నాటికి మూడు డిపోలు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 300 బస్సులు రానున్నాయి. 2025 నాటికి 1,000 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల శివారు ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.