హైదరాబాద్ నగరంలో మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. అత్యంత రద్దీగా ఉండే నల్గొండ చౌరస్తా-ఒవైసీ జంక్షన్ మధ్య రూ. 620 కోట్ల వ్యయంతో 2.58 కిలోమీటర్ల స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతుండగా.. వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇది పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.